బ్రిటన్ పార్లమెంటు దిగువ సభ 'హౌస్ ఆఫ్ కామన్స్'లో డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించడానికి అనుకూలంగా 438 మంది, వ్యతిరేకంగా 20 మంది ఎంపీలు ఓట్లు వేశారని బీబీసీ ప్రతినిధి గగన్ సబర్వాల్ చెప్పారు.బ్రిటన్లో ఇక డిసెంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 13న ఫలితాలు వెల్లడిస్తారు.డిసెంబర్ 12న ఎన్నికలు నిర్వహించాలనే ప్రణాళికలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ 418 ఓట్ల మెజారిటీతో విజయవంతం అయ్యారు.
దీనితో కలిసి గత ఐదేళ్లలో బ్రిటన్లో ఇది ఐదో సార్వత్రిక ఎన్నిక అవుతుంది. అంతే కాదు, 1923 తర్వాత మొదటిసారి డిసెంబర్లో బ్రిటన్ ఎన్నికలు జరగబోతున్నాయి.మంగళవారం అధికారిక ఓటింగ్ ద్వారా ఎంపీలు ఎన్నికల ప్రతిపాదనను సమర్థించడంతో జాన్సన్ తన ప్రణాళికకు మరో అడుగు దగ్గరయ్యారు.
లేబర్ పార్టీ ఎంపీలు మాత్రం నవంబర్ 9న ఎన్నికలు జరగాలని కోరుకున్నారు. అప్పటికి అకడమిక్ సెషన్ నడుస్తుంటుందని, యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఓట్లు వేయడం సులభం అవుతుందని చెప్పారు."త్వరలో జరిగే ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నామని నేను చెబుతూనే వచ్చాను" అని లేబర్ పార్టీ నేత జెరేమీ కార్బిన్ అన్నారు. అంతకు ముందు, ఎంపీలు మూడు సార్లు ఆయన ప్రతిపాదనను వ్యతిరేకించారు.