భారత పర్యటనకు ముందు బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. బంగ్లాదేశ్ టెస్టు, టీ20 కెప్టెన్ షకీబ్ ఉల్ హాసన్పై రెండు సంవత్సరాల పాటు నిషేధం విధిస్తున్నట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) ప్రకటించింది. రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. నిషేధం అనంతరం షకీబ్ ఉల్ హాసన్ మాట్లాడుతూ "నేను ఎంతో ప్రేమించే ఆట నుంచి నన్ను నిషేధించడంతో ఎంతో బాధగా ఉంది. కానీ, నేను చేసిన తప్పుని పూర్తిగా అంగీకరిస్తున్నాను. ఆటగాళ్లు అవినీతిపై ధీటుగా పోరాటం చేయడానికి ఐసీసీ, ఏసీయూ ఎంతో తోడ్పడతాయి. నేను నా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేదు" అని అన్నాడు.