పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రక్తంలో ప్లేట్లైట్ల సంఖ్య భారీగా తగ్గినట్లు వైద్యులు తెలిపారు. గతంలో నవాజ్కు గుండెపోటు రాగా అప్పటి నుంచి ఆయన అందుకు సంబంధించిన మందులు వాడుతున్నారు. ఆ మందుల వాడకం వల్లే ప్లేట్లెట్లు సంఖ్య పడిపోయినట్లు తెలిపిన వైద్యులు ప్రస్తుతం ఆ మందుల వాడకం నిలుపుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం విదేశాలకు వెళ్లేందుకు షరీఫ్ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ కోర్టు అనుమతి పొందాల్సి ఉంది. పనామా పత్రాల కుంభకోణం కేసులో షరీఫ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు.