ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తీహార్ జైల్లో చిదంబరంకు అస్వస్థత

national |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2019, 06:37 PM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఈ సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం పాలైన చిదంబరంను వెంటనే జైలు వర్గాలు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించాయి. చిదంబరంను ఎయిమ్స్ వైద్యులు వీఐపీ ప్రైవేటు రూమ్ లో ఉంచి వైద్యపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.  ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న చిదంబరంను ఇటీవలే ఈడీ కూడా కస్టడీలోకి తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com