హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ను కలుస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బిజెఎల్పి నేతగా ఎన్నికైన మనోహర్లాల్ ఖత్తార్తో కలిసి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్ను కోరుతామని ఆయన చెప్పారు. జెజెపి, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని ఆయన చెప్పారు. వివాదాస్పద ఎమ్మెల్యే గోపాల్ కందా మద్దతు తీసుకోబోమని ఆయన స్పష్టం చేశారు.