సీఎం జగన్ పై మాజీ మంత్రి,టీడీపీ నేత దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మద్య పాన నిషేధం పేరుతో ప్రజలను మోస్తున్నారని...ఆ పార్టీ నేతలే రాత్రి 8 తర్వాత మద్యం అమ్ముతున్నారని దేవినేని ఆరోపించారు. తన ఇంటి చుట్టూ 144 సెక్షన్ పెట్టుకున్న ఏకైక సీఎం జగన అంటూ దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.ఇసుక కోరతతో దాదాపు 30 లక్షల మంది వీధిన పడ్డారన్నారు. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల, సీఎం ఓఎస్డీ అవినాష్ రెడ్డిలు దుష్ట చతుష్టయంగా పనిచేస్తున్నారని పోలీసులను వెంటపెట్టుకుని మరీ ఇసుక తీసుకెళుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.