విశాఖ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు తెన్నేటి పార్కు వద్ద రోడ్డుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పెద్ద ముప్పు తప్పింది. రహదారిపై కొండ చరియలు విరిగిపడటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జీవీయంసీ అధికారులు కొండ చరియలను తొలగిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను పంపిస్తున్నారు.