పదవీ విరమణ చెందినప్పటికీ, ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందు నుంచి సేవలు అందిస్తున్న వారందరినీ తక్షణం తప్పించాలని ఆదేశించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో విడుదల చేసింది. ఈ క్రమంలో మార్చి 31వ తేదీకి ముందు పేపర్ నోటిఫికేషన్, సంబంధిత నియామక ప్రక్రియ ద్వారా కాకుండా నియమితులైన రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ సిబ్బందినీ ఉద్యోగాల నుంచి తొలగించింది.
ఈ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర స్థాయితో మొదలుకొని జిల్లా, డివిజన్, మండల, గ్రామ కార్యాలయాలతో పాటు కార్పొరేషన్లు, అటానమస్ సంస్థలకు వర్తిస్తుందని జీవోలో స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు ఈ నెల 31 లోపు తగు చర్యలు తీసుకుని సంబంధిత నివేదికను సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆ ఉత్తర్వులల్లో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలను సకాలంలో అమలు చేయక పోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, సెక్రటరీలు ఈ నెల 31 లోపు తగు చర్యలు తీసుకుని సంబంధిత నివేదికను సాధారణ పరిపాలన శాఖకు, ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని ఆ ఉత్తర్వులల్లో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలను సకాలంలో అమలు చేయక పోతే సంబంధిత ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఇక డిప్యూటీ కార్యదర్శి అంతకంటే ఎక్కువ హోదా ఉన్న అధికారుల్లో ఎవరైనా ఇప్పటికీ ఈ ఏడాది మార్చి 31వ తేదీకి ముందున్న సీటు లోనే ఇప్పటికీ ఉంటే.. వారి సబ్జెక్టు మార్చడం, లేదా హెడ్ క్వార్టర్స్ లోనే మరో ఆఫీసుకు పంపడం చేయాలని తెలిపారు. మూల వేతనం రూ.56,780 కంటే ఎక్కువ ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని వివరించారు.