పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయిలు మోసగించి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ కస్టడీని లండన్లోని కోర్టు పొడిగించింది. జైలులో ఉన్న నీరవ్ మోడీ వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యాడు. అతడి కస్టడీని నవంబర్ 11 వరకూ పొడిగిస్తూ న్యాయమూర్తి నీనా టెంపియా ఆదేశాలు జారీ చేశారు.