ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదం

international |  Suryaa Desk  | Published : Thu, Oct 17, 2019, 10:35 AM

 సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మక్కా నుంచి మదీనా వెళ్లే హిజ్రా రోడ్డులో విదేశీయులతో వెళ్తున్న ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com