సౌదీ అరేబియాలోని పవిత్ర నగరం మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 35 మంది విదేశీయులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మక్కా నుంచి మదీనా వెళ్లే హిజ్రా రోడ్డులో విదేశీయులతో వెళ్తున్న ఓ బస్సు మరో భారీ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద ఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు సౌదీ అధికారులు తెలిపారు.