బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం(GWTCS) అధ్యక్షురాలిగా పాలడుగు సాయిసుధ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు సంస్ధ ఓ ప్రకటనలో తెలిపింది.. ఆమె ఎన్నిక పట్ల సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు మన్నే సత్యనారాయణ తదితర కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలిపారు.ప్రస్తుతం ఈ సంస్థ ఉపాధ్యక్షురాలిగా సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆమె. 2020-21 ఏడాదికి గానూ అధ్యఞురాలి బాధ్యతల్లో కొనసాగుతారని పేర్కొంది.