ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇద్దరికి ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఈడీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఇరువురికి నోటీసులు అందజేసింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సురేశ్ తదుపరి విచారణను నవంబర్ 29కి వాయిదా వేశారు. ఎయిర్ సెల్ మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఇప్పటికే అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు.