కర్ణాటక శాసనసభ సమావేశాల కవరేజ్ నుంచి ప్రైవేటు మీడియాను నిషేధిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై నిరసనగా రాష్ట్రంలోని జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. కర్ణాటక శాసనసభ మూడు రోజులపాటు సమావేశమవుతున్నది. ఈ సమావేశాల కవరేజ్కు దూరదర్శన్కు మాత్రమే అనుమతి మంజూరు చేశారు. ప్రైవేటు ఎలెక్ట్రానిక్ మీడియాను నిషేధించారు. దినపత్రికల విలేకరులను సమావేశాలకు అనుమతించారు. దీనిపై ఎలెక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ధర్నా నిర్వహించారు.