ఉల్లిగడ్డ ఉత్పత్తి తగ్గిన నేపథ్యంలో మార్కెట్లో ఉల్లిపాయ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఉల్లిగడ్డ కోసం దొంగతనాలు జరిగే పరిస్థితులు వచ్చాయి. బిహార్ లోని పట్నాకు దగ్గరలో ఫతువా థానా అనే ఏరియాలో 328 సంచుల ఉల్లిగడ్డను ఎత్తుకెళ్లారు దొంగలు. గోడౌన్ లో నిల్వ చేసిన ఉల్లి సంచులను రాత్రికి రాత్రే దొంగలు అపహరించారు. చోరీకి గురైన ఉల్లిగడ్డ 8 లక్షల 25 వేలు విలువ చేస్తుందని గోడౌన్ ఓనర్ చెప్పారు. అలాగే లక్షా 73 వేల విలువైన నగదు కూడా చోరీ అయిందని వాపోయాడు.