అమరావతి నుండి హైకోర్టును తరలిస్తున్నారా..? రాయలసీమలోహైకోర్టును ఏర్పాటు చేస్తారా..? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు ఏపీలో కొత్త ఉద్యమాలకు బీజం వేశాయి. అమరావతి నుండి హైకోర్టును తరలిస్తున్నారని ప్రచారంతో 5 జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. అయితే రాయలసీమకు హైకోర్టు కావాల్సిందేనంటూ సీమ న్యాయవాదులు రోడ్డెక్కారు. రాజధాని విషయంలోనే తమ సీమకు అన్యాయం జరిగిందని కర్నూలు న్యాయవాదులు చెబుతుంటే... ఉమ్మడి రాష్ట్రంలోనే హైకోర్టు బెంచ్ కోసం ఉద్యమాలు చేశామని గుంటూరు న్యాయవాదులు అంటున్నారు. దీంతో హైకోర్టుపై పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి.