దేశాధినేతలు పర్యావరణాన్ని కాపాడడంలో విఫలమవుతున్నారని 16 ఏళ్ల బాలిక గ్రేటా థండర్బర్గ్ ఐక్యరాజ్యసమితిలో ఆరోపించింది. నేటి తరం నేతలు యువతను మోసం చేస్తున్నారని ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పర్యావరణ హక్కుల కోసం ఉద్యమిస్తున్న బాల కార్యకర్త గ్రేటా థండర్బర్గ్ ఐక్యరాజ్యసమితిలో జరుగుతున్న సదస్సులో మాట్లాడుతూ.. నిష్క్రియాపరత్వంతో ప్రపంచ దేశాల నాయకులు తనలాంటి కొత్త తరానికి ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీరు నా కలల్ని, నా బాల్యాన్ని మీ ఒట్టి మాటలతో దొంగిలించారు. ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పర్యావరణ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయి’ అని పేర్కొన్నారు. హాయిగా చదువుకోవాల్సిన నేను.. మీ అలసత్వం వల్లే ఇక్కడికి వచ్చానని ఆమె చెప్పింది. మనమంతా సామూహిక వినాశనం ముందు ఉన్నామని ఆందోళన వ్యక్తం చేసింది. మీ ప్రయోజనాల కోసం మమ్ముల్ని మోసం చేస్తారా.. మీకెంత ధైర్యం అంటూ గ్రేటా థండర్బర్గ్ ఊగిపోయింది.
"The eyes of all future generations are upon you. And if you choose to fail us, I say we will never forgive you."
-- @GretaThunberg at UN #ClimateAction Summit. https://t.co/g4uXzT9aRM pic.twitter.com/2nBzFxsnxP
— United Nations (@UN) September 23, 2019