ఆఫ్గనిస్థాన్లో ఘోరం జరిగింది. ఆఫ్గనిస్థాన్లోని జాబుల్ ప్రాంతంలోగల ఒక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిలిపివుంచిన ట్రక్కులో హఠాత్తుగా బాంబు పేలుడు సంభవించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, 85 మంది గాయాలపాలయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన ఈరోజు ఉదయం ఆరు గంటల ప్రాంతంలో జరిగింది. పేలుడు ధాటికి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న భవనాలు కూడా దెబ్బతిన్నాయి. కాగా నేషనల్ డిఫెన్స్ నర్వీస్ కార్యాలయం ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలోనే ఉంది. అయితే ఎన్డీఎస్కు చెందిన వారెవరూ ఈ ప్రమాదం బారిన పడలేదని తెలుస్తోంది. కాగా తాలిబన్లు ఎన్డీఎస్ కార్యాలయాన్ని టార్గెట్గా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం.