తన తండ్రి చిదంబరం ఏ రోజు కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేయలేదని, అరెస్ట్ రాజకీయ ప్రేరేపితమని కార్తి చిదంబరం బుధవారం ఆరోపించారు. 2008లో జరిగిన దానికి 2017లో కేసు నమోదు చేశారని, సమన్లు అందిన ప్రతిసారి విచారణకు హాజరయ్యారన్నారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ హడావుడి సృష్టించారని , దర్యాఫ్తు సంస్థల తీరును ఆయన తప్పుబట్టారు.
ఇదంతా బీజేపీ తప్ప ఎవరు చేస్తున్నారని, డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? అని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా కార్తి చిదంబరం ఎదురు ప్రశ్న వేశారు. ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసిందని, ఆయన కూడా హాజరయ్యారని, మేం కోర్టుకు వెళ్తామని, క్లీన్గా తిరిగి వస్తామని చెప్పారు.