నిన్నటి నుంచి అజ్ఞాతంలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది. బుధవారం కాంగ్రెస్ కార్యాలయంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమైన చిదంబరం కేవలం 3 నిముషాలు మీడియా సమావేశం నిర్వహించి తాను ఎక్కడికి పారిపోలేదని చెప్పి, ఇతర ప్రశ్నల కు అవకాశం ఇవ్వకుండా నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు.
అయితే ఏఐసీసీ కార్యాలయానికి చిదంబరం వచ్చిన విషయం తెలుసుకున్న సీబీఐ, ఈడీ బృందాలు ఆతనిని అరెస్ట్ చేసెందుకు అక్కడికి చేరుకున్న అప్పటికే చిదంబరం వెళ్లి పోవడంతో వెనుదిరిగారు.
అనంతరం చిదంబరం నివాసానికి చేరుకున్న సీబీఐ, ఈడీ అధికారులను లోనికి రానిచ్చేందుకు గేటు తెరచేందుకు సెక్యూరిటీ నిరాకరించింది దీనితో అధికారులు గోడ దూకి లోపలికి వెళ్ళి చిదంబరంతో మాట్లాడి అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం తీసుకెళ్లారు.