ఆగస్టు 3 నుంచి విండీస్ పర్యటనలో బిజీబిజీగా ఉన్న కోహ్లీ సేన ‘జాలీ’ బీచ్లో సందడి చేసింది. రేపటి నుంచి వెస్టిండీస్తో టెస్టు సిరీస్ మొదలుకానున్న నేపథ్యంలో కోహ్లీ సేన ఒత్తిడిని పక్కన పెట్టి బీచ్లో కొద్దిసేపు సరదాగా గడిపింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ అజింక్య రహానె, రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ అగర్వాల్, సహాయ సిబ్బంది బీచ్లో జాలీగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన చిత్రాలను కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో ఉంచాడు. ‘బీచ్లో ఆటగాళ్లతో ఇదో ఓ అద్భుతమైన రోజు’ అంటూ ట్యాగ్ చేశాడు. దీంతో కోహ్లీ సేన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. 17 ఏళ్ల నుంచి సుదీర్ఘ ఫార్మాట్లో వెస్టిండీస్పై తిరుగులేని ఆధిపత్యాన్ని భారత్ చెలాయిస్తోంది. 2002 నుంచి టెస్టు సిరీసుల్లో వెస్టిండీస్ను వరుసగా మట్టికరిపిస్తోంది. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టీ20, వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్స్వీప్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్లో భాగంగా రేపటి నుంచి ఆంటిగ్వాలో విండీస్తో తొలి టెస్టును ఆడనుంది. ఈ సిరీస్తోనే ఇరుజట్లకు టెస్టు ఛాంపియన్షిప్ మొదలవ్వడంతో ఇది ఎంతో కీలకం కానుంది.
భారత జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), మయాంక్ అగర్వాల్, రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమి, రిషభ్ పంత్, ఛెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా, ఇషాంత్ శర్మ, రోహిత్ శర్మ, హనుమ విహారి, ఉమేశ్ యాదవ్