అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్ బీఐ డెబిట్ కార్డుల తొలగింపు దిశగా అడుగులు వేస్తున్నది. ఆన్ లైన్ లావాదేవీలను పెంచడమే లక్ష్యంగా ఆ బ్యాంకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇక పోతే వినియోగదారులకు పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలను రద్దు చేసింది. కార్ల రుణాలపై 8.70% వడ్డీ వసులు చేయనుంది. అలాగే ఉద్యోగులైన వారికి బ్యాంకులో ఖాతా ఉంటే కార్ ఆన్ రోడ్ ధరలో 90శాతం వరకూ రుణాన్ని అందజేయనుంది.