కర్ణాటకలో ముఖ్యమంత్రి యెడ్యూరప్ప నేడు తన మంత్రివర్గాన్ని నేడు విస్తరించనున్నారు. 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. మంత్రివర్గంలోకి తీసుకుంటున్న వారి పేర్ల జాబితాను యెడ్యూరప్ప ఇప్పటికే గవర్నర్ వజూభాయ్ వాలాకు అందజేశారు. గోవింద మక్తప్ప కరజాల్, అశ్వథ్ నారాయణ్, లక్ష్మణ్ సందప్ప సవిడి, కెఎస్ ఈశ్వరప్ప, ఆర్ అశోక, జగదీశ్ షెత్తార్, బి శ్రీరాములు, ఎస్. సురేశ్ కుమార్, వి. సోమన్న, సిటి రవి, బసవరాజ్ బొమ్మాయ్, కోట శ్రీనివాస్ పూజారి, జెసి మధుస్వామి, చంద్రకాంతగౌడ చన్నప్పగౌడ పాటిల్, హెచ్ నగేశ్, ప్రభు చౌహాన్, జొళ్లె శశికళ అన్నాసాహెబ్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.