నేడు ఫోటోగ్రఫీ రంగంలో అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకొని ఫోటోగ్రాఫర్లు అద్భుతాలు సృష్టిస్తున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) పేర్కొన్నారు. సోమవారం 181వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను పురస్కరించు గుడివాడ ఎన్జీవో హోమ్ లో జరిగిన గుడివాడ ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ వేడుకలను జ్యోతి ప్రజ్వలన చేసి ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కెమెరా సృష్టికర్త లూయిస్ డ్యాగురే చిత్రపటానికి పులమాలలతో నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి నాని మాట్లాడుతూ అందుబాటులో ఉన్న ఆధునిక ఫోటోగ్రఫీ సాంకేతికతను వినియోగించుకొని, మనలో ఉన్నా టాలెంట్ ను వెలికితీసి తమదైన శైలిలో కెమెరాల ద్వారా అద్బుతమైన ఛాయాచిత్రాలను సృష్టించవచ్చని. గుడివాడ ఫోటోగ్రాఫర్లకు అన్ని వేళలా అండగా ఉంటానని మంత్రి నాని హామీ ఇచ్చారు.