తమ పదవీకాలం ముగిసినా ప్రభుత్వం కేటాయించిన బంగ్లాల్లో కొనసాగు తున్న మాజీ ఎంపీలకు కేంద్రం గడువు విధించింది. వారంలోగా భవనా లు ఖాళీ చేయాలని సూచించింది. ముఖ్యంగా లుటెయిన్స్ ప్రాంగణంలో ని బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ ఎంపీలు వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.చివరి మూడు రోజులూ విద్యుత్, నీటి సరఫరా కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు హౌసింగ్ కమిటీ ఛైర్మన్ సీఆర్ పాటిల్ తెలిపారు.
దిల్లీలోని లుటెయిన్స్ ప్రాంగణంలో సుమారు 200 మంది మాజీ ఎంపీలు గడువు ముగిసిన తర్వాత కూడా కొనసాగుతున్నారు. 16వ లోక్సభ రద్దైనప్పటికీ వీరు కొనసాగుతుండడం గమనార్హం. వాస్తవానికి సభ రద్దైన నెల రోజుల్లోగా తమకు కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మే 25న 16వ లోక్సభ రద్దు కాగా.. జూన్ 25 నాటికే వీరు ఖాళీ చేయాల్సి ఉండగా నేటికీ కొందరు అవే భవనాల్లో కొనసాగుతున్నా రు.