ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొదట కాంపౌండర్, తరువాత డాక్టర్.. నర్సుపై అత్యాచారం..

national |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 06:05 PM

ఏడాది పాటు ఓ నర్సుపై జరిగిన పైశాచిక దాడి ఇటీవలే వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం..ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బాధిత మహిళ..స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. అదే ఆసుత్రిలో అశోక్ అనే వ్యక్తి కాంపౌండర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా..ఏడాది క్రితం ఓ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళపై కన్నేసిన అశోక్ ఓ రోజు తన పన్నాగాన్ని అమలు చేశాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెకు ఆ రోజు కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అయితే అంతకుమునుపే కూల్‌డ్రింక్‌లో అతడు మత్తుమందు కలిపాడు. దీంతో కూల్‌డ్రింక్ తాగిన కాసేపటికి ఆమె సృహ కోల్పోయింది. ఆ తరువాత నర్సుపై అశోక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డు చేశాడు. ఇక అప్పటి నుంచీ..వీడియోలను బయటపెడతా అంటూ నర్సును బ్లాక్ మెయిల్ చేసి తన కోరికలు తీర్చుకునేవాడు. 


కొంత కాలం తరువాత ఈ విషయం..ఆదే ఆసుపత్రిలో పనిచేసే సురేంద్ర మహర్షి అనే డాక్టరుకు తెలిసింది. వీడియో బయటకు పొక్కితే తన పరువు పోతుందని భయపడిన నర్సు బలహీనతను క నిపెట్టిన సరేంద్ర..ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ విషయాన్ని తన తమ్ముడికీ చెప్పడంతో అతడు కూడా నర్సుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.


తనతో ఆ పశువులు ఆడుతున్న వికృత క్రీడను తట్టుకోలేని ఆమె.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇటీవలే వారిని హెచ్చరించింది. దీంతో సురేంద్ర..సదరు నర్సును ఆగస్టు 16న విధుల నుంచి తొలగించాడు. ఈ విషయాన్ని ఆమె..తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com