ఏడాది పాటు ఓ నర్సుపై జరిగిన పైశాచిక దాడి ఇటీవలే వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం..ఆ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. బాధిత మహిళ..స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తుంది. అదే ఆసుత్రిలో అశోక్ అనే వ్యక్తి కాంపౌండర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా..ఏడాది క్రితం ఓ దారుణం చోటుచేసుకుంది. బాధిత మహిళపై కన్నేసిన అశోక్ ఓ రోజు తన పన్నాగాన్ని అమలు చేశాడు. నైట్ డ్యూటీలో ఉన్న ఆమెకు ఆ రోజు కూల్ డ్రింక్ ఆఫర్ చేశాడు. అయితే అంతకుమునుపే కూల్డ్రింక్లో అతడు మత్తుమందు కలిపాడు. దీంతో కూల్డ్రింక్ తాగిన కాసేపటికి ఆమె సృహ కోల్పోయింది. ఆ తరువాత నర్సుపై అశోక్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దృశ్యాలన్నీ వీడియోలో రికార్డు చేశాడు. ఇక అప్పటి నుంచీ..వీడియోలను బయటపెడతా అంటూ నర్సును బ్లాక్ మెయిల్ చేసి తన కోరికలు తీర్చుకునేవాడు.
కొంత కాలం తరువాత ఈ విషయం..ఆదే ఆసుపత్రిలో పనిచేసే సురేంద్ర మహర్షి అనే డాక్టరుకు తెలిసింది. వీడియో బయటకు పొక్కితే తన పరువు పోతుందని భయపడిన నర్సు బలహీనతను క నిపెట్టిన సరేంద్ర..ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ విషయాన్ని తన తమ్ముడికీ చెప్పడంతో అతడు కూడా నర్సుపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
తనతో ఆ పశువులు ఆడుతున్న వికృత క్రీడను తట్టుకోలేని ఆమె.. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇటీవలే వారిని హెచ్చరించింది. దీంతో సురేంద్ర..సదరు నర్సును ఆగస్టు 16న విధుల నుంచి తొలగించాడు. ఈ విషయాన్ని ఆమె..తన కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.