ముమ్మారు తలాక్ చెప్పడానికి నిరాకరించిందని కట్టుకున్న భార్యను కన్నబిడ్డ కళ్లెదుటే ఓ దుర్మార్గుడు సజీవ దహనం చేశాడు. ఈ దారుణంతో ఆమె కన్నవారి కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. నిందితుడు రఫీక్ది యూపీలోని శ్రావస్తి. కుటుంబాన్ని ఇక్కడే వదిలేసి మహారాష్ట్రలో పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం అతను ఫోన్లో భార్యకు ముమ్మారు తలాక్ చెప్పాడు. ఆమె అంగీకరించకపోవడంతో ఇటీవల ఇంటికి వచ్చిన అతను ఆమెపై తీవ్రంగా ఒత్తిడి చేశాడు.. లొంగకపోవడంతో దాడి చేశాడు. కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కన్నతండ్రి కర్కశాన్ని కళ్లారా చూసిన ఐదేళ్ల చిన్నారి విషయాన్ని తన మేనమామకు తెలిపింది. ఆయన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.