రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రముఖ గాయని లతా మంగేష్కర్ను కలిశారు. రాష్ట్రపతి ముంబైలోని లతా మంగేష్కర్ నివాసానికి వెళ్లి..ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. మన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మా ఇంటికి రావడం గౌరవంగా భావిస్తున్నా. సర్.. మీరు మేమంతా గర్వపడేలా చేశారు’ అని ట్వీట్ చేసిన లతా మంగేష్కర్..ఆయన దిగిన ఫొటోలను షేర్ చేశారు.