జమ్మూకశ్మీర్లోని థావీ నది ఉప్పొంగుతోంది. జమ్మూలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జ్ వద్ద ఆకస్మికంగా వరదలు రావడంతో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు ఆ వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. దీంతో ఆ ఇద్దరూ బ్రిడ్జ్పైనే కూర్చుండిపోయారు. భారీగా వస్తున్న వరద వల్ల వాళ్లు ఎటు కదలేకపోయారు. అయితే వరద నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆర్మీ రంగంలోకి దిగింది. ఆర్మీ హెలికాప్టర్ ద్వారా ఓ జవాను బ్రిడ్జ్ కట్టపై దిగి దానిపై ఉన్న ఇద్దరిని రక్షించాడు. ఇద్దరినీ తాడు సాయంతో పైకిలాగి కాపాడారు.