ట్రెండింగ్
Epaper    English    தமிழ்

51 ఏళ్ళ క్రితం అదృశ్యమైన వాయుసేన విమానం శకలాలు లభ్యం

national |  Suryaa Desk  | Published : Mon, Aug 19, 2019, 01:21 PM

51 సంవత్సరాల క్రితం హిమాచల్ ప్రదేశ్ లో అదృశ్యమైన భారత వాయుసేన విమానం శకలాలు తాజాగా లభ్యమయ్యాయి. భారత వాయుసేన చరిత్రలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల్లో ఒకటిగా ఈ విమానం అదృశ్యాన్ని అభివర్ణిస్తారు. 1968, ఫిబ్రవరి 7న 98 మంది రక్షణ శాఖ సిబ్బందితో లాహుల్ - స్పితి జిల్లాలో ఉన్న ఢాకా గ్లేసియర్ లో ఏఎన్-12, బీఎస్-534 విమానం అదృశ్యమైంది. ల్యాండింగ్ సమయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో, లేహ్ ఎయిర్ పోర్టుకు చేరలేకపోయిన విమానం, వెనక్కు తిరిగి చండీగఢ్ కు వెళుతూ, రోహ్తంగ్ పాస్ వద్ద అదృశ్యమైంది. విమానం కోసం ఎన్నో రోజుల పాటు విస్తృతంగా గాలించినా ప్రయోజనం లేకపోయింది. ఆపై 2003లో హిమాలయన్ మౌంటనేరింగ్‌ ఇనిస్టిట్యూట్ సభ్యులు, విమానంలో ప్రయాణించి, ప్రాణాలు కోల్పోయిన జవాను బేలీరామ్ మృతదేహాన్ని ఓ ప్రాంతంలో గుర్తించారు.


దీంతో తిరిగి విమానం కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మరికొన్ని మృతదేహాలు అదే ప్రాంతంలో కనిపించాయి. ఆపై 2009లో గాలింపును పూర్తిగా నిలిపివేశారు. ఇటీవల ఢాకా గ్లేసియర్ లో కొన్ని శకలాలు కనిపించడంతో, మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా, నిన్న పలు ప్రధాన భాగాలు లభ్యమయ్యాయి. ఇంజిన్, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్, ఆయిల్ ట్యాంక్, కాక్ పిట్ డోర్ వంటివి కనిపించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com