ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తానన్న చంద్రబాబుకు ఇక్కడ సొంత ఇల్లు కాదు కదా సెంటు భూమి లేదనీ, చివరకి వాచీ, ఉంగరం లేదని కూడా చెబుతున్నారని మంగళ గిరి ఎంమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి కామెంట్స్ చేశారు.. ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చేసిన చంద్రబాబు, కరకట్ట పై అక్రమ భవనంలో నివాసమున్నరని, ఇది వరదలకు మునిగిపోతుండటంతో ఇక్కడ నుంచి మల్లి హైదరాబాద్ పరుగులు తీశారని ఎద్దేవా చేశారు.
వచ్చే ఉగాది నుంచి ఇల్లు లేని వారందరికి మా సీఎం జగన్ మోహన్ రెడ్డి పక్కా ఇళ్లు మంజూరు చేయబోతున్నారుని, చంద్రబాబు .. నువ్వెళ్ళి వెళ్లి ఎం ఆర్ ఓ ఆఫీస్ లో దరఖాస్తు పెట్టుకో , నీ దగ్గరకు కూడా మా వాలంటీర్ వస్తాడు. సెంటో, సెంటున్నరో స్థలం ఇస్తారు. లేదా మీరు లక్షల కోట్ల అవినీతి చేశారు కదా.. ఆ డబ్బులు కట్టకున్నా ప్రభుత్వం మీ ఇంటికి భద్రతతో పాటూ సహాయం కల్పిస్తుంది అని రామకృష్ణా రెడ్డి సెటైర్లు వేశారు.