తన నివాసం వద్ద డ్రోన్లు ఎగరడంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పికి , డిజిపికి ఆయన ఫోన్ చేసి ఈ విషయమై ప్రశ్నించారు. హై సెక్యూరిటీ జోన్లో డ్రోన్లు ఎగరడంపై డిజిపిని చంద్రబాబు నిలదీశారు. డ్రోన్లు ఎగురవేసిన వ్యక్తులు ఎవరు? తానుండే నివాసంపై డ్రోన్లతో నిఘా పెట్టిందెవరు? దాని వెనుక ఉన్న కుట్ర ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, డిజిపి అనుమతి లేకుండా డ్రోన్లు ఎగరవేయడానికి అవకాశం లేదని ఆయన అన్నారు.