వివాదాస్పద ఇస్లాం ఆధ్యాత్మికవేత్త జకీర్ నాయిక్ను మలేషియా అధికారులు ప్రశ్నించనున్నారు. మలేషియాలో నివసిస్తున్న జకీర్ జాతివివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అతడిని ప్రశ్నించడానికి అధికారులు సమాయత్తమయ్యారు. భారత్లోని ముస్లింలకంటే మలేషియాలోని హిందువులు వంద రెట్లు ఎక్కువగా హక్కులు పొందుతున్నారని జకీర్ వ్యాఖ్యానించాడు. దీనితో అతడిని దేశంనుంచి బహిష్కరించాలని పలువురు మంత్రులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అతడిని ప్రశ్నించడానికి అధికారులు సమన్లు పంపారు.