న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా మారినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అరుణ్ జైట్లీని పరామర్శించేందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇవాళ ఉదయం ఎయిమ్స్ వెళ్లారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను రాష్ట్రపతి ఆరా తీశారు. గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ.. వారం రోజులుగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా 2019 ఎన్నికలకు జైట్లీ దూరంగా ఉన్న విషయం విదితమే.