హర్యానాలోని జింద్ జిల్లాలో నేడు జరుగనున్న ర్యాలీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పాల్గొననున్నారు.్న ‘అష్ట ర్యాలీ’ పేరిట జరిగే ఈ ర్యాలీ హర్యానా శాసనసభకు ఈ ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నిర్వహిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ర్యాలీలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులు పాల్గొననున్నారు. 90 మంది సభ్యులు ఉండే హర్యానా శాసనసభకు ఈ ఏడాది నవంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.