అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కపిల్ సిబాల్, బిఎస్ హూడా, అహ్మద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తరువాత సిడబ్ల్యుసి భేటీలో సోనియా గాంధీని తాత్కాలికంగా అధ్యక్షురాలిగా ఎన్నుకున్న విషయం విదితమే.