ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పరవశంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు

international |  Suryaa Desk  | Published : Wed, Aug 14, 2019, 12:22 PM

భార్య భర్తలు పరవశంలో మునిగిపోయారు. ముద్దులు పెట్టుకుంటూ ప్రపంచాన్నే మరిచిపోయారు. కానీ అంతలో ఊహించని ఘటన జరిగింది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వీరు..విగతజీవులయ్యారు. ముద్దుల్లో మునిగి ప్రపంచాన్ని మరిచిపోయి..అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఎస్పినోజ్, విడాల్‌లు భార్య భర్తలు. వీరిద్దరూ టూరిస్టు గైడ్‌లుగా పనిచేసేందుకు క్యూసో పట్టణానికి వచ్చారు. పని ముగించుకుని ఇంటికి వెళుతున్నారు. బెత్లెహాం బ్రిడ్జిపై కాసేపు ఆగారు. ఇద్దరూ తన్మయత్వంతో ముద్దుల్లో మునిగి తేలిపోయారు. ఎస్పీనోజ్ బ్రిడ్జి రెయిలింగ్‌పై కూర్చొగా..భర్త ఎడాల్ కింద నిలబడ్డాడు. విడాల్‌ను దగ్గరగా లాక్కొనేందుకు ప్రయత్నించింది. దీంతో పట్టు తప్పింది.


50 మీటర్ల దిగువున రోడ్డుపై వీరిద్దరూ పడిపోయారు. ఎస్పినోజ్, విడాల్‌లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించగా..ఎస్పీనోజ్ మార్గమధ్యంలో..విడాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. సీసీ టీవీలో దృశ్యాలు నమోదయ్యాయి






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com