ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ లో టమాటా కేజీ రూ. 300 దాటింది

international |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2019, 01:54 AM
పాకిస్థాన్ ప్ర భుత్వం  ఆర్టికల్‌ 370 రద్దుపై  ఆగ్రహించి,  కశ్మీరీలకు సంఘీభావం పేరుతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకుంది. దీంతో పాకిస్తాన్ లో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగిపోయాయి.  పాక్ తాము ఎగుమతులు, దిగుమతులు చేసే అవకాశాన్ని కోల్పోయింది. దీంతో భారత్‌ నుంచి కారుచౌకగా దిగుమతి చేసుకుంటున్న నిత్యావసరాలు ఆగిపోవడంతో   పాకిస్థాన్‌ సామాన్య ప్రజలు భగ్గుమన్న ధరలతో అల్లాడిపోతున్నారు. ఇక్కడ అక్కడ కిలో పది రూపాయలకు హోల్ సేల్ గా దొరికే టమాటాలు పాక్ మార్కెట్లో ఇప్పుడు రూ.300 అయ్యాయి. దీనిని నిలువరించేందుకు అఫ్ఘానిస్థాన్‌ నుంచి టమాటాలను పాక్‌ దిగుమతి చేసుకుంటున్నా అవి ఏమూలకు సరిపోవడం లేదట . వాణిజ్య బంధాన్ని రద్దు చేసుకోవడంతో పాకిస్థాన్‌పైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ చెప్పారు. ఐతే వాణిజ్య నిషేధంపై పాకిస్థాన్‌ వ్యాపారవర్గాలు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. తమకు తీరని నష్టమైనా దేశం కోసం త్యాగం చేస్తామని చెబుతున్నాయి. 





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com