ఈ నెల 15న భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘బ్లాక్ డే’ నిర్వహించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ తెలిపారు . బుధవారం అయన మీడియాలో ఓ ప్రకటన విడుదల చేస్తూ జమ్మూ-కశ్మీరుకు లో అధికరణ 370 రద్దు, రాష్ట్రాన్ని ముక్కలుగా విభజించి భారత కేంద్ర ;ర్కారు ఆధీనంలోకి తీసుకోవాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ పాకిస్థాన్ ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఈ నెల 14న స్వాతంత్ర్య దినోత్సవాన్ని కశ్మీరీలకు సంఘీభావంగా జరుపుకోవాలని పాకిస్థాన్ పౌరులకు పిలుపుయిచ్చారు.