ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా భారత్ తన సొంత రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అంతే కాకుండా అంతర్జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించిందని పేర్కొన్నారు. పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరనున్నట్లు చెప్పారు. అలాగే కాశ్మీర్ విషయంలో భారత్ తీరుకు వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం మద్దతు కోరుతామన్నారు.