వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ముమ్మర సహాయక చర్యలను చేపట్టింది.ఇందులో భాగంగా సోమవారం మంత్రుల బృందం కరువు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు అనేకమంది నిర్వాసితులయ్యారు.వేలాది ఎకరాల్లో పంటలు నీటిలో మునిగిపోయాయి.ఏజెన్సీ ప్రాంతాల్లోని పలు ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి.దీంతో దేవీపట్నం మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు ఆళ్ల నాని,పిల్లి సుభాష్ చంద్రబోస్, పినిపే విశ్వరూప్,కన్నబాబు పరిశీలించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లోకి ట్రాక్టర్లపై వెళ్లిన మంత్రులు వీరవరంలో నిర్వాసిత శిబిరాలను పరిశీలించి, భోజన సదుపాయాలను పర్యవేక్షించారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను ఆదుకుంటామని తెలిపారు.సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతు న్నామని తెలిపారు.వరద తగ్గిన తరువాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటామన్నారు.నిర్వాసితులకు భోజనం, మందులు, పాలు ఎప్పటికప్పుడు అందే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.పి.గన్నవరం నియోజ కవర్గ పరిధిలోని ఊడిముడి లంక,బూరుగు లంక,గంటి పెదపూడి లంక,అరిగెల వారిపేటలో అధికారుల పర్యవేక్షణలో గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు.