అమెరికాలో తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని కృషి చేస్తున్న ఆచార్య వెల్చేరు నారాయణరావుకు మండలి వెంకట కృష్ణారావు 2019 సంస్కృతి పురస్కారం లభించింది. ఆగస్టు 5వ తేదీన హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును బహుకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డా. కేవి. రమణాచారి హాజరవుతున్నారు. విశిష్ట అతిధిగా డా. బ్రహ్మానందం హాజరవుతున్నారు. ఆత్మీయ అతిధిగా మాజి డిప్యూటీ స్పీకర్ డా. మండలి బుద్ధ ప్రసాద్ వస్తున్నారు.