రైతులు సుభిక్షింగా ఉండాలని, వర్షాలు బాగా కురవాలని కోరుతూ లోక కళ్యాణం కోసం ప్రతి ఏడూ ఓ వ్యాపారి తిరుమలకు పాదయాత్రగా వెళుతున్నారు. 2004లో ప్రారంభమైన ఈ యాత్ర ఏటా కొనసాగుతూ వస్తోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన తుక్కు వ్యాపారి సీసాలరాజు శ్రావణంలో పటాన్చెరు నుంచి తిరుమల వరకు తన బృందంతో ఆధ్యాత్మిక యాత్రను కొనసాగిస్తున్నారు. సోమవారం 16వ సారి తిరుమల యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రారంభించిన రోజు నుంచి 15 రోజుల్లోగా తిరుమల చేరుకుంటారు. చెప్పులు వేసుకోకుండా యాత్ర ప్రతి రోజు 40 కి.మీ చొప్పున పూర్తి చేస్తారు. తనతో పాటు తిరుమలకు పాదయాత్రగా వచ్చే భక్తుల ఖర్చులను ఆయనే భరిస్తారు.