టీమిండియా వెస్టిండీస్ టూర్కు రోహిత్ బయల్దేరాడు. సోమవారం జులై29న టీమిండియా ముంబై ఎయిర్పోర్టు నుంచి విండీస్కు వెళ్లింది. టీ20ల్లో చోటు దక్కించుకోలేకపోయిన వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ముంబై ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. ఈ విషయాన్ని శిఖర్ ధావన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టు చేశాడు. 'వెస్టిండీస్ టూర్కు అంతా సెట్ అయింది పార్టనర్తో కలిసి వెళ్తున్నా- ద హిట్ మాన్' అంటూ ట్వీట్ చేశాడు శిఖర్ ధావన్. వరల్డ్ కప్ టోర్నీలో పాట్ కమిన్స్ వేసిన బంతి ఎడమ చేతికి తగలడంతో గాయంతో టోర్నీ నుంచి తప్పుకున్నాడు ధావన్. కోలుకోవడానికి సమయం పడుతుందని భావించిన టీమిండియా మేనేజ్మెంట్ రిషబ్ పంత్కు అవకాశం కల్పించింది. విండీస్ టూర్కు కోలుకున్న ధావన్ అందుబాటులోకి వచ్చాడు. ధావన్-రోహిత్లు పరిమిత ఓవర్ల ఫార్మాట్లో 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి టాపార్డర్లో ఆడుతున్నారు. వీరి భాగస్వామ్యంతో 105ఇన్నింగ్స్లు ఆడి 4వేల 726పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డే భాగస్వామ్యాల్లో రోహిత్-ధావన్ల జోడీ ఏడో స్థానంలో ఉంది. సచిన్-గంగూలీల తర్వాత వరుసలో వీళ్లు నిలిచారు.