ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు హైదరాబాద్ కు బయల్దేరారు. విజయవాడ పరిధిలోని గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో జగన్ దంపతులు హైదరాబాద్ బయల్దేరారు. రేపు సాయంత్రం సీఎం జగన్ జెరూసలేం పర్యటనకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 5న జగన్ తిరిగి అమరావతికి రానున్నారు.