బెలూచిస్తాన్లోని క్వెట్టాలో సంభవించిన భారీ పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా ఐదుగురు మరణించారు. మరొక 38 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసు వాహనం లక్ష్యంగా కొందరు దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బచ్చా ఖాన్ చౌక్ వద్ద పేలుడు సంభవించిందని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనర్ ఆఫ్ పోలీస్ అబ్దుల్ రజాక్ చీమా చెప్పారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఒ) లక్ష్యంగా ఈ దాడి జరిగిందని, అయితే ఆయన గాయాలతో తప్పించుకోగలిగారని డిఐజి చెప్పారు. ఎస్హెచ్ఒను చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించినట్లు డిఐజి తెలిపారు. ఎస్హెచ్ఒ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది.