పాకిస్తాన్ తన గగనతలం మూసివేయడంతో భారత్నుంచి వెళ్లే విమానాలపై తీవ్ర ప్రభావం పడిందని ప్రభుత్వం పేర్కొంది. రోజుకు 600 విమానాలను దారి మార్చి నడపాల్సి వచ్చింది. బాలాకోట్లో వైమానిక దాడుల తరువాత భారత విమానాలు తమ గగనతలపైనుంచి వెళ్లకుండా పాకిస్తాన్ నిషేధం విధించింది. గత ఫిబ్రవరి 27నుంచి జూలై 16 వరకూ 140 రోజులపాటు పాక్ తన గగనతలం మూసివేసింది. దీనితో 84,000 విమానాలను దారి మళ్లించి నడపాల్సి వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి చెప్పారు.