హైదరాబాద్: పాకిస్తాన్లో ఆర్మీ విమానం కూలిన ఘటనలో 15 మంది మృతిచెందారు. రావల్పిండి నగరంలో ఉన్న ఓ రెసిడెన్షియల్ ప్రాంతంలో ఆ విమానం కూలింది. ఈ ప్రమాదంలో అయిదు మంది సిబ్బంది, పది మంది సాధారణ పౌరులు మృతి చెందారు. ఇదే ప్రమాదంలో మరో 12 మంది గాయపడ్డారు. శిక్షణ విన్యాసాలు చేస్తున్న సమయంలో విమానం కూలింది. రెసిడెన్షియల్ ప్రాంతంలో కూలడంతో అనేక ఇండ్లు మంటలకు దగ్ధమయ్యాయి. మిలిటరీ విమానం ప్రమాదానికి గురికావడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. బిల్డింగ్లు మొత్తం నల్లగా మసకబారిపోయాయి.