ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఐర్లండ్ తో ఏకైక టెస్ట్ – ఇంగ్లండ్ గెలుపు

international |  Suryaa Desk  | Published : Sat, Jul 27, 2019, 11:48 AM

నవ్వులపాలైన చోటనే ఇంగ్లండ్‌ సగర్వంగా తలెత్తుకుంది. ఐర్లండ్‌తో జరిగిన ఏకైక టెస్టులో మూడోరోజు నాటకీయ పరిణామాల మధ్య ఇంగ్లండ్‌ 143 పరుగుల తేడాతో ఐర్లండ్‌పై గెలుపొందింది. తొలి రోజు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్‌కు ముందే ఆలౌటై విమర్శలపాలైన ఇంగ్లండ్‌ మూడోరోజు ఐర్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 38 పరుగులకే ఆలౌట్‌చేసి చిత్తుగా ఓడించింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో ప్రత్యర్థికంటే మెరుగైన ప్రదర్శన చేసిన ఐర్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా చాపచుట్టేసింది. ఓపెనర్‌ జేమ్స్‌ మెకల్లమ్‌(11) మినహా ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇంగ్లండ్‌ ఇద్దరు బౌలర్లనే ఉపయోగించి పది వికెట్లను కూల్చింది. క్రిస్‌ ఓక్స్‌ 6, క్రిస్‌ బ్రాడ్‌ 4 వికెట్లు దక్కించుకున్నారు. ఐర్లండ్‌ కేవలం 15.4 ఓవర్లపాటు మాత్రమే క్రీజులో నిలిచింది. అంతకుముందు 9 వికెట్లకు 303 పరుగులతో మూడో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్‌ తొలి బంతికే చివరి వికెట్‌ను కోల్పోయింది. ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 92 పరుగులతో ఆకట్టుకున్న జాక్‌ లీచ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com