పాకిస్థాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉండే రావల్సిండిలోని మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ కూడా ఉన్నాడని చెబుతున్నారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి ఇంత వరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. మసూద్ అజార్ తీవ్ర అనారోగ్యంతో ఈ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని... ఒక ప్రణాళికాబద్ధంగానే దాడి చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు, ఘటనా స్థలి వద్దకు వెళ్లేందుకు మీడియాకు కూడా ఆర్మీ అధికారులు అనుమతినివ్వలేదు.